Print Friendly and PDFPrint This PagePrint Friendly and PDFSave This Page As PDF

Saturday, June 2, 2012

తొలి గెరిల్లా పోరాట వీరుడు శివాజి - నేడు హిందూ సామ్రాజ్య దినోత్సవం


ప్రపంచ చరిత్రలో తొలి గెరిల్లా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ. కత్తి పట్టి యుద్ధ రంగంలో శివాజీ కాలుమోపే నాటికి భారతీయ పోరాట యోధులకు విజయమో వీరస్వర్గమో లక్ష్యంగా ఉండేది. 16వ శతాబ్దంలో రంగప్రవేశం చేసిన శివాజీ విజయమే యుద్ధ లక్ష్యంగా నిర్దేశించాడు. ఈరోజు ఓటమి తప్పదనిపిస్తే యుద్ధరంగం నుండి తప్పుకోవాలి, రేపు అనువైన సమయంలో దాడిచేసి గెలవాలి. ఇదీ ఆయన సిద్ధాంతం. ఇలాంటి పోరాటాలు మిగతా ప్రపంచ దేశాల్లో జరిగినప్పుడు వాటినే వారు గెరిల్లా పోరాటం అన్నారు.
ప్రపంచంలో పలు తావుల్లో గెరిల్లా పోరాటాలు జరిగినా శివాజీ మాత్రమే అసాధారణ విజయం సాధించాడు. కేవలం పదిహేనేళ్ళ వయసులో వేయి మంది అనుచరులతో తోరణ దుర్గాన్ని ఆక్రమించుకొని 1645 మార్చి 30న శివాజీ తొలిసారి విజయ పతాకాన్ని ఎగరవేశాడు. ఆ తరువాత దాదాపు 20 సంవత్సరాలపాటు జరిపిన యుద్ధాల్లో అధిక శాతం విజయాలు శివాజీనే వరించాయి. అలాగని పరాజయాలు, పారిపోవడాలు లేవని కాదు. అంతిమ విజయం మాత్రం శివాజీ పక్షమే అయ్యేది. భేషజాలకు పోని వ్యూహాలు, భేషైన అనుచరులే అందుకు కారణం.
బీజాపూర్ సుల్తాన్ ఆజ్ఞతో కర్నూలు సుబేదార్ సిద్ధిజోహార్ 15వేల సైన్యంతో పన్హాలా దుర్గంపై దండెత్తినపుడు సాధారణ పద్ధతుల్లో ఎదురించడం అనువు కాదని అంచనా వేసుకున్న శివాజి, బాజీప్రభు తదితర కొద్దిమంది అనుచరులతో అర్థరాత్రి కోట వదిలి విశాల గఢం వైపుకు పారిపోయాడు. శత్రు సైన్యం శివాజీని వెంబడించింది. విశాలగఢ్ చేరే లోపే శివాజీకి ముప్పుతప్పని పరిస్థితి. మధ్యలో పావనఖేఢ్ వద్ద రెండు కొండల మధ్య సన్నని ఇరుకు దారి. ఒక్కసారి నలుగురికన్నా ముందుకు పోలేరు. ఇక్కడ బాజీప్రభు చూపిన సాహసం అద్భుతం. శివాజీని ఒప్పించి ముందుకు పంపి, కనుమ వద్ద గుప్పెడు సైనికులతో కాపుకాసి అతను శత్రు సైన్యాన్ని అడ్డుకున్నాడు. శివాజీ క్షేమంగా విశాల్‌గఢ్ కోట చేరుకున్న సంకేతం చెవిసోకే దాకా కనుమలో కాలుమోపకుండా శత్రువును నిలువరించి ఆ పోరాటంలో 1660, జూలై 13న బాజీ ప్రభు అమరుడైనాడు.సింహగడాన్ని తల్లి జిజియా బాయి కోరుతున్నది అని తెలిసిన వెంటనే తన కొడుకు పెళ్లి పనులను కూడా పక్కనపెట్టి, 1670, ఫిబ్రవరి 4న సింహగఢ్ కోటపై దాడిచేసి ప్రాణాలు ధారవోసి కోటను సాధించిన తానాజీ త్యాగం ‘‘గఢ్ దక్కింది, సింహం పోయింది!’’ అన్న శివాజీ నిట్టూర్పులో వ్యక్తవౌతుంది. యోగ్యమైన అనుచరులను తయారుచేసుకోవడంతో శివాజీ ప్రతిభకు ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే. తన సామ్రాజ్యాన్ని కబళిస్తున్న శివాజీని పట్టి తెమ్మని బీజాపూర్ సుల్తాన్ తన సేనాపతి అఫ్జల్‌ఖాన్‌ను పంపినప్పుడు శివాజీ ఒక్కొక్క కోటనే వదిలి పారిపోయాడు. తన పరిమితి సైన్యంతో 29వేల పదాతిదళం, 10 వేల అశ్విక దళం కల్గిన శత్రువును మైదాన ప్రదేశంలో ఎదిరిస్తే ముప్పు తప్పదని భావించిన శివాజీ గెరిల్లా పోరునే ఎంచుకున్నాడు. కొండ కోనల్లో పారిపోతున్న శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడానికి అఫ్జల్‌ఖాన్ పండరిపూర్, తుల్జాపూర్ వంటి పుణ్యక్షేత్రాలను అపవిత్రం చేయడం, స్ర్తిలను హింసించడం ప్రారంభించాడు. నిన్నటివరకు జైశివాజీ! అని నినదించిన ప్రజలే బీజాపూర్ సేనల అకృత్యాలకు తాళలేక శివాజీని అసమర్థుడు, పిరికిపంద అని నిందించడం ప్రారంభించారు. అందుకు శివాజీ కుంగిపోలేదు, రెచ్చిపోయి మైదాన ప్రాంతాల మీదికి ఉరికి రాలేదు. ప్రతాప్‌గఢ్ కోటలోనే ఉండి మంతనాలు సాగించి, తగిన వ్యూహరచన చేశాడు. కొయనా లోయలో తనకు అనువైన చోటికి ప్రత్యర్థి వచ్చేదాకా పిరికివాడిలా ప్రవర్తించి, తన స్థావరంలోకి అతణ్ణి ఒంటరిగా రప్పించాడు, సిద్ధి ఇబ్రహీం తదితర అను చరులు తోడురాగా శివాజీ స్వయంగా వెళ్లి 1659, నవంబరు 10న అఫ్జల్‌ఖాన్‌ను నేర్పుగా మట్టుపెట్టి, విజయాన్ని మరింత ఘనంగా చేజిక్కించుకున్నాడు. అప్పటికి శివాజీ వయస్సు కేవలం 29 సంవత్సరాలే. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా యుద్ధాలు చేయడం అప్పట్లో ఆనవాయితీ. యుద్ధ సమయ నియమాన్ని కూడా గెలిచే అవకాశానికి అనువుగా మార్చుకున్నాడు శివాజీ. పూనా కోటను ఆక్రమించిన ఔరంగజేబు మేనమామ షయిస్తఖాన్‌పై దాడికి 1663, ఏప్రిల్ 15 రాత్రి మూడో జామును అనువైన ముహూర్తంగా నిర్ణయించాడు. తక్కువ శక్తిని ప్రయోగించి, ఎక్కువ ఫలితాన్ని రాబట్టాలనేది ఆయన వ్యూహం. చీకటి మాటున జరిగిన ఈ దాడికి శివాజీ స్వయంగా నాయకత్వం వహించాడు. దాడిలో కొడుకును, తన చేతి వేళ్ళను కోల్పోయిన షహిస్తఖాన్ సిగ్గు చచ్చి పూనా వదిలి ఆగ్రాకు పారిపోయాడు.
1657, అక్టోబర్ 24న కళ్యాణ్‌దుర్గాన్ని జయించాక దుర్గ్ధాపతి పారిపోగా, బందీగా చిక్కిన దుర్గ్ధాపతి కోడలిని తెచ్చి శివాజీ ముందు నిలిపి, స్వీకరించమని కోరినప్పుడు ‘అమ్మా పరస్ర్తి తల్లితో సమానమన్న ధర్మం మరచి నా అనుచరుడు చేసిన అపరాధాన్ని మన్నించు’ అని వేడుకుని సగౌరవంగా, సురక్షితంగా ఆమెను ఇంటికి పంపాడు. స్ర్తిల పట్లే కాక ఖురాన్ వంటి మత గ్రంథాల పట్ల కూడా శివాజీ పలు మార్లు భక్తిశ్రద్ధలను కనబరిచాడు. ‘నా మతాన్ని నేను ఆచరిస్తాను- ఇతర మతాలను గౌరవిస్తాను’ అనే సమదృష్టిని తన అనుచరుల్లో శివాజీ పాదుకొలిపాడు అనేందుకు ఇవి తార్కాణాలు.
దర్సా సారంగ్ నేతృత్వంలో నిర్మాణమైన నౌకాదళంలో సహాయకులుగా ఇబ్రహీంఖాన్, దౌలత్‌ఖాన్ తదితర ముస్లిములు సైతం శివాజీకి అత్యంత విశ్వాస పాత్రులుగా పనిచేశారు. మాయ మాటలతో ఔరంగజేబు శివాజీని ఆగ్రా కోటకు రప్పించి 1666 మే, 29న గృహ నిర్బంధంలో ఉంచిన సందర్భంలో తన అనుచరునికి తనలా వేషం వేసి, కావలివారిని ఏమార్చి మూణ్ణెల్లు తిరక్కుండానే గృహ నిర్బంధం నుండి ఆగస్టు 17న తప్పించుకుపోయాడు శివాజీ. ప్రాణాంతకమైన ఈ సాహస కృత్యంలో శివాజీలా నటించి, అతని వేషంలో వసతి గృహంలో చిక్కుపడిపోయిన సాహసికుడైన శివాజీ అనుచరుడు ఒక ముస్లిము!
ఇక శివాజీని ఉపేక్షించి లాభం లేదని భావించిన బీజాపూర్ రాజు తన కొలువులో ఉన్న శివాజీ తండ్రి శహాజీని 1648 జూలై 28న బంధించి, సజీవ సమాధి చేయనున్నట్లు శివాజీకి కబురు పంపాడు. ఇప్పటివరకు గెల్చిన కోటలన్నింటిని బీజాపూర్ రాజుకు అప్పజెప్పి శివాజీ అపరాధిగా లొంగిపోవాలి, లేదా తండ్రిని కోల్పోవాలి. తన మేధకు పదునుపెట్టిన శివాజి చక్కటి రాజకీయ ఎత్తుగడను ఖరారు చేశాడు. బీజాపూర్ రాజులతో వైరం కలిగిన ఢిల్లీ సుల్తాను షాజహాన్‌తో శివాజీ సంప్రదింపులు జరిపాడు. ఢిల్లీకి సామంతుగా ఉంటానని ప్రతిపాదించి అందుకు ప్రతిగా తన తండ్రికి మొగల్ పాదుషాల కొలువులో సభ్యత్వం అడిగాడు. దక్షిణాన బీజాపూర్ రాజ్యాన్ని అదుపులో ఉంచడానికి ఉపకరిస్తుందనే ఆలోచనతో షాజహాన్ శివాజీ ప్రతిపాదనను ఆమోదించి, ‘శహాజీ తమ సభలో గౌరవ సభ్యుడని, అతని యోగక్షేమాలకు బాధ్యత వహించాలని’ తెలియచేస్తూ బీజాపూర్‌కు శ్రీముఖం పంపించాడు. దాంతో శహాజీ 1649 మే 16న క్షేమంగా విడుదలై భార్యాబిడ్డలను చేరుకున్నాడు. లక్ష్య సాధనకు అడ్డుపడే వాడే శత్రువు, తోడ్పడేవాడే మిత్రుడు. అంతేగాని రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సూత్రాన్ని పాటించిన శివాజీ కాలాంతరంలో మొగలులతో కూడా తలపడ్డారు.
శివాజీని ఔరంగజేబు ఆగ్రాకు ఆహ్వానించినపుడు కష్టనష్టాలకు సిద్ధమయ్యే బయలుదేరాడు. ఉత్తర భారతాన్ని, ఔరంగజేబు బలాబలాలను అంచనా వేయడానికి అది అనువైన యోజనగా భావించాడు. చిక్కుల్లోపడి, తప్పించుకు రావలసిన పరిస్థితి వస్తే వివిధ ప్రధాన కేంద్రాలలో తనకు సహకరించే వారి సమాచారాన్ని సిద్ధం చేసుకున్నాడు. తన వేగులను ముందుగానే పూనాకు, సమీప పరిసరాలకు పంపాడు. కాబట్టే మొగలు సైన్యం కండ్లు గప్పి శివాజీ ఆగ్రా కోట నుండి క్షేమంగా తిరిగి రాగలిగాడు. అనుసరణీయమైన రాజకీయ వ్యూహకర్తగా శివాజీ చరిత్రలో నిలిచాడు. వివిధ కారణాలవల్ల శివాజి తన రాజ్యానికి దూరంగా ఎంతోకాలం ఉండవలసి వచ్చేది. ఔరంగజేబు ఆహ్వానంతో 1666 మే 3వ తేదీన ఆగ్రాకు ప్రయాణమైన శివాజి, బందీయై, తిరిగి తప్పించుకొని 1666 డిసెంబరు 11వ తేదీకి రాయగఢ్ చేరాడు. దాదాపు ఏడు నెలల కాలం తన రాజ్యానికి దూరంగానే ఉన్నాడు. అయినా సరే రాజ్యవ్యవస్థ ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ముందుకు సాగేది.
నలువైపుల నుండి ఎగసి పడుతున్న ప్రమాదాలను ఎదుర్కొంటూ కూడా తన పాలనా వ్యవస్థను సజావుగా ముందుకు సాగించడం శివాజి పాలనా దక్షతకు ప్రత్యక్ష సాక్ష్యం. అవినీతి పరులను, స్ర్తిలను అవమానించే వారిని అత్యంత కఠినంగా శిక్షించాడు. తన రాజ్యంలో జమీందారీ, వతన్‌దారి వ్యవస్థలను రద్దుచేసి వ్యవసాయానికి అనువైన పథకాలను రూపొందించి శివాజి రైతాంగాన్ని ప్రోత్సహించాడు. ఆధునిక సాధనాలను వినియోగించుకున్న శివాజీ తన ఉద్యమానికి సమకాలీన సాంకేతికతను తోడు చేశాడు. ఐరోపా వాసులనుండి తుపాకులను కొన్నాడు. అచ్చు యంత్రాలను సైతం ఉపయోగించుకోడానికి కృషిచేశాడు. యుద్ధ భూమిలో తిరుగులేని విజయాలను సాధించిన శివాజీ పట్ట్భాషేకానికి వర్ణం సమస్య అయింది. కాశీనుండి గంగాజలంతో సహా గాంగభట్టు అనే పండితుడిని రప్పించి, శివాజీ క్షత్రియుడని ఆయనతో ప్రకటన చేయంచి, సమస్త రాజలాంఛనాలతో హిందూ పద పాదుషాహీ బిరుదుతో 1674 జేష్ఠద్ధ త్రయోదశి నాడు రాయగఢ్‌లో పట్ట్భాషేకం జరిపించుకొని సమాజ ఆమోదాన్ని పొందడం ఆఖరి మెట్టు. శివాజీ పట్ట్భాషేకం జరుపుకొని నేటికి 338 సంవత్సరాలు. మానవాళి మనుగడ గురించి తపన చెందుతున్న క్రియాశీలురు, మేధావులు ధైర్యంగా ముందుకు సాగడానికి శివాజీ జీవితం ఒక ఆదర్శంగా నిలుస్తుంది.

Source : AndhraBhoomi 

Related Posts Widget For Blogger with ThumbnailsBlogger Widgets

Tuesday, May 29, 2012

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవు - ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలి : అం.ప్ర హై కోర్టు స్పస్టికరణ


హైదరాబాద్, మే 28: విద్యా, ఉద్యోగ రంగాల్లో ఓబిసి కోటాలోనే మైనార్టీలకు 4.5 రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.
కేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో ఓబిసి కోటా 27 శాతంలోనే మైనార్టీలకు 4.5 రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వు చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. మతపరంగా మైనార్టీలకు అత్యంత వెనుకబడిన వారికి రిజర్వేషన్లు అవసరమంటూ కేంద్రం తరఫు న్యాయవాది అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎటువంటి ఆధారం చూపలేకపోయారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జోరాస్ట్రియన్లు ఒకే వర్గం కిందకు వచ్చే మతస్తులు కారని, వారు వేరువేరు వర్గాలకు చెందిన వారని హైకోర్టు పేర్కొంది. కేంద్ర విద్యా సంస్థలు ఐఐటి తదితర సంస్థల్లో మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తే, బీసీలకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్ ఆర్ కృష్ణయ్య తరఫున వాదించిన న్యాయవాది కె. రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీసీలకు కేటాయించిన 27శాతం రిజర్వేషన్లలోనే మైనార్టీల్లోని బీసీలకు 4.5 శాతం సబ్ కోటా రిజర్వు చేయాలని ఆదేశిస్తూ కేంద్రం జారీ చేసిన ఆఫీసు మెమొరాండాలు చెల్లవని హైకోర్టు తీర్పులో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించిందని, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను కూడా కేంద్రం పట్టించుకోలేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగ నిబంధనల ముందు నిలబడలేదు’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకుర్ తన 25పేజీల తీర్పులో పేర్కొన్నారు.
కేంద్రానికి చెంప పెట్టు: బిజెపి
బిసి కోటానుంచి ముస్లింలకు 4.5 శాతం రిజర్వేషన్ల కోటాపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టి వేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఇది చారిత్రాత్మక తీర్పని, కేంద్ర ప్రభుత్వానికి ఇది చెంపపెట్టని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా ఈ నిర్ణయం తీసుకుందని హైకోర్టు పేర్కొందన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు పేర్కొందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం మతపరమైన రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలని సూచించారు

Source : AndhraBhoomi

Sunday, May 6, 2012

జిహాది తీవ్రవాద వ్యతిరేక యుద్ధం లో భారత ప్రభుత్వ విధానం లో స్పష్టత లేదు : Dr ప్రవీన్ తొగాడియా

మీడియా తో మాట్లాడుతున్నా ప్రవీణ్ భాయి తొగాడియా
జిహాది తీవ్రవాద వ్యతిరేక యుద్ధం లో భారత  కేంద్ర ప్రభత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు కాని తీసుకుంటున్న చర్యలు ప్రజలలో నమ్మకాన్ని కలిగించలేక పోతున్నాయని విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయకార్యక్షులు శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా గారు ఆందోళన వ్యక్తం చేసారు .కొత్త డిల్లి లో మీడియా తో మాట్లాడిన వారు ఇంకా అనేక విషయాల పై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు ముఖ్యంగా NCTC విషయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వవాలు సరైన నిర్ణయం తీసుకోలేక పోతున్నాయని ఇది దేశ అంతర్గత భద్రతా దృశ్య తీవ్రమైన పరిణామమని , అమెరికాలో ఒక్క సారి ఉగ్రవాద దాడి జరిగి ఇప్పటికి దశాబ్దం దాటినా మళ్ళి ఆ దేశం పై ఉగ్రవాదులు కన్నెత్తి చూడకుండా వారు చర్యలు తీసుకున్నారు కాని మన దేశంలో అలాంటి చర్యలు ఏమి కనిపించడం లేదు , కాబట్టి అన్ని పార్టిల వారు తమతమ రాజకీయ కారణాలను ప్రక్కన పెట్టి దేశ అంతర్గత భద్రత పై సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు

భారత దేశ ప్రతిష్ఠను పెంచిన ‘అగ్ని-5’క్షిపణి

  • - శంకర్‌రాయ్ చౌధురి
మధ్యశ్రేణి ఖంతాంతర క్షిపణి (ఐఆర్‌బిఎం) అగ్ని-5 ప్రయోగం విజయవంతం కావడం నిజంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలను నింపింది. ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యమున్న ఈ క్షిపణి నిజంగానే మన దేశ ప్రతిష్ఠను ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేసింది. ఒరిస్సాలోని వీలర్స్ ఐలాండ్ నుంచి జరిగిన ఈ అద్భుత ప్రయోగం, భారత్‌ను అంతర్జాతీయ వ్యూహాత్మక క్షిపణీ సమాజంలో సభ్యురాలిని చేసింది. మన దేశాన్ని ఈ గ్రూపులోకి ఆహ్వానించినా లేక ఆహ్వానించకపోయినా ప్రపంచం తప్పనిసరిగా ఈ నిజాన్ని మనసులో సుస్థిరం చేసుకొని, సహజీవనం గడపాల్సిందే. భారత ప్రజల విషయానికి వస్తే అగ్ని-5 క్షిపణి విజయవంతం కావడం, వారిలో ఆనందాతిరేకాలకు కారణమయింది. లేకపోతే నిరంతరం కొనసాగుతున్న రాజకీయపరమైన ఖండనార్హ వైఖరులను భరించడం దేశీయంగా దాదాపు శాశ్వతమైపోయి ఉండేది. క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఆందోళన మాట అట్లావుంచితే, దేశీయంగా అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రతిభ, పచ్చికమైదానాలతో ఆకుపచ్చగా అలరారుతున్న విదేశాలకు,్భరత్‌లో దేశీయంగా అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అందుబాటులోనే ఉన్నదన్న సంగతి మాత్రం సుస్పష్టం చేయడమే కాదు.. ఆ వాస్తవాన్ని అవి గుర్తించేలా చేసింది.
కానీ భారత్ తనలో వ్యక్తమవుతున్న ఆనందాతిరేకతను మరెంతకాలమో కొనసాగించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఆసియాలో ఉన్న అత్యంత కఠినమైన వాతావరణం, భారత్ శాస్త్ర సాంకేతిక మరియు వ్యవస్థీకృత నిర్మాణ రంగాల్లో మరింత కష్టపడి ముందుకు కొనసాగాలన్న కఠోర వాస్తవాన్ని గుర్తు చేస్తున్నది. సమగ్ర స్వదేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణుల ఉత్పత్తిని సత్వరమే ప్రారంభించి సాధ్యమైనంత త్వరలో సైన్యానికి అప్పగించడం అత్యంత అవసరం. భారత వ్యూహాత్మక ఆయుధ సంపత్తి రక్షణ బాధ్యతను ఆయా సైనిక దళాలు నిర్వర్తిస్తున్నప్పటికీ, స్ట్రాటిజిక్ ఫోర్సెస్ కమాండ్ వాటిని ప్రయోగించే కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. అది సమీకృత రక్షణ మంత్రిత్వశాఖ సిబ్బంది కింద పనిచేస్తుంటుంది. ఇతర దేశాల్లో మాదిరిగా అది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా కింద కాకుండా మనదేశంలో అది చీఫ్స్ ఆఫ్ స్ట్ఫా కమిటీ ఆధిపత్యంలో విధులను నిర్వర్తిస్తుంటుండటం విచిత్రం. ఇక్కడ మిగిలిన దేశాల మాదిరిగా మనం ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నిస్తే.. మనకు మాత్రమే పరిమితమయ్యే కారణాలను ఉదహరిస్తారు. జాతీయ భద్రత విషయానికి వచ్చినప్పుడు ఉన్నతస్థాయి నిర్వహణా వ్యవస్థలో ఉన్న లోటు పాట్లను సరిచూసుకోవడానికి అగ్ని-5 క్షిపణి మరో అవకాశం కల్పిస్తోంది. అసలు వ్యూహాత్మక దళాలపై, సమీకృత రక్షణ సిబ్బంది మాత్రమే నియంత్రణ కలిగి ఉంటారు. దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన దగ్గరినుంచి కేవలం దాన్ని అపద్ధర్మంగానే ఉపయోగిస్తున్నారు తప్ప మరే విధంగా వినియోగించుకోవడంలేదు. ఇది కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న తంతు. మన త్రివిధ దళాలను సమన్వయ పరచడమే ప్రధాన విధిగా సమీకృత రక్షణ సిబ్బంది వ్యవస్థ ఏర్పాటయింది. ఇది జాతీయ స్థాయిలో వ్యూహాత్మక, ఆచరణాత్మక ప్రణాళికా రచనలకు ఇదే అత్యున్నత అథారిటీ. ప్రజల దృష్టిలో ఈ వ్యవస్థను, రక్షణ దళాలు ఏవిధంగా చూపినప్పటికీ..దూరదృష్టి లేకపోవడం, సర్వీసులో ఉన్న సైనికాధికార్ల మధ్య ఉండే పరస్పర సంకుచిత వ్యతిరేకతల వంటి కారణాల వల్ల ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్ట్ఫాను అత్యంత ముఖ్యమైన విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన విధులనుంచి పక్కన పెట్టడంతో, కేవలం అలంకార ప్రాయంగా మిగిలిపోయింది.
చట్టబద్ధంగా, తర్కపరంగా చెప్పాలంటే అగ్ని-5 క్షిపణులను, అవసరమైనప్పుడు ప్రయోగించడానికి వీలుగా భారత సైన్యంలోని వ్యూహాత్మక క్షిపణీ యూనిట్లకు కేటాయిస్తారు. మరికొన్నింటిని వ్యూహాత్మకంగా లక్ష్యాలపై దాడులు జరిపేందుకు వీలుగా వాయుసేనకు కేటాయిస్తారు. మానవచోదిత యుద్ధ విమానాల స్థానే వీటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో చోటు చేసుకోబోయే మార్పులను భవిష్యత్తులో మన కళ్ళకు కట్టేవే. ఇప్పటికే ప్రచురితమైన వార్తలను బట్టి చూస్తే, అగ్ని-5 క్షిపణిని పూర్తిగా అభివృద్ధి పరచిన తరువాత, సిలో-బేస్, రోడ్-మొబైల్ కాన్ఫిగరేషన్స్‌లో మోహరించనున్నట్టు తెలుస్తోంది. అయితే మనం మరింత గర్వపడాల్సిన అంశమేమంటే, అగ్ని-5కు అవసరమైన మరిన్ని సంక్లిష్టమైన ఇతర పరికరాలు కూడా దేశీయంగానే తయారవనుండటం. ముఖ్యంగా వీటిల్లో చాలా భాగం ప్రైవేటు రంగం నుంచి ఉత్పత్తి కానుండటం మరో విశేషం. వీటిల్లో ముఖ్యమైనవేంటంటే, అగ్ని క్షిపణుల కోసం తయారు చేసే మొబైల్ మిస్సైల్ ప్లాట్‌ఫాంలు, క్షిపణిని నిలిపి, మోహరించి, రవాణా చేయడమే కాకుండా ప్రయోగించడానికి ఉపయోగపడే వాహనాలు వంటివి గణతంత్ర దినోత్సవం నాడు, బహిరంగంగా ప్రదర్శించారు కూడా. వీటన్నింటినీ పరిశీలిస్తే..ఈ రంగంలో మనం సాధించింది తక్కువేమీ కాదనేది సుస్పష్టమవుతుంది. సైన్యానికి అవసరమైన ఉపయుక్త సమాచారాన్ని సేకరించే ఇంటెలిజెన్స్,సర్వైవలెన్స్ ఉపగ్రహాలు, లక్ష్యాన్ని తెలుసుకోవడం, క్షిపణికి మార్గదర్శనం చేయడం, ఇతర సమాచార, మద్దతు వ్యవస్థలు వంటివన్నీ స్వదేశీయంగా తయారు చేయడం మనకు ఎంతో గర్వకారణం.
అణ్వాయుధాలను తొలిసారి ప్రయోగించరాదనేది భారత్ అణు విధానం. అయితే శత్రువులు తొలిసారి అణ్వస్త్రాలను ప్రయోగిస్తే..తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా భారత్ వెనుకాడబోదు. ఈ నేపథ్యంలో అగ్ని-5 క్షిపణిని అణ్వస్త్రాలను లేదా సంప్రదాయ ఆయుధాలను ప్రయోగించేందుకు ఉపయోగించవచ్చు. శత్రువులు తొలిసారి దాడి చేసిన స్వభావాన్ని బట్టి ప్రతిదాడిలో అగ్ని క్షిపణిని ఏవిధంగా ప్రయోగించడమనేది ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం అగ్ని-5కు అనుబంధంగా ఉన్న వౌలిక సదుపాయాలన్నీ, శత్రువు జరిపే తొలి దాడిని తట్టుకొని తిరిగి ఎదురుదాడి చేయడానికి అనువుగా ఉండాలి. ఆవిధంగా అత్యంత ముఖ్యమైన, విలువైన లక్ష్యాలైన నగరాలు, జనం అధికంగా ఉండే ప్రాంతాలు, వ్యూహాత్మక ప్రాంతాలుగా ఉన్న ‘కౌంటర్-్ఫర్స్’ లక్ష్యాలైన శత్రు సైనికులు అధికంగాగల ప్రాంతాలు, సంక్లిష్టమైన వౌలిక సదుపాయాల వంటి వాటిపై ప్రతీకారాత్మక దాడులు జరిపేందుకు సర్వం సిద్ధంగా ఉండాలి. మరి భారత్ పెద్ద ఎత్తున చేపట్టే ప్రతికార దాడులు ఎట్లా ఉంటాయి? ఈ ప్రశే్నకాదు,దీని అనుబంధ ప్రశ్నలు కూడా అడగాల్సి ఉంటుంది.
అగ్ని-5 క్షిపణి ప్రయోగం పాకిస్థాన్‌ను రెచ్చగొట్టింది. దీని ఫలితమే హతాఫ్-7 క్షిపణి ప్రయోగం. ఈ క్షిపణి మూడువేల నుంచి మూడువేల ఐదువందల వరకు దూరాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని చెబుతున్నారు. అంటే భారత ఉపఖండంలోని మారుమూల ప్రాంతాలు సైతం దీని పరిధిలోకి వస్తాయి. అంతకు ముందు భారత్ ప్రయోగించిన ఖండాతర క్షిపణుల పరిధిలోకి పాకిస్థాన్‌లోని చాలా ప్రాంతాలు వస్తాయి. అయితే భారత్ ద్వీప కల్పం ప్రాంతం, ఈశాన్య భారత్‌లు మాత్రం పాకిస్థాన్ క్షిపణుల పరిధికి ఆవలే ఉన్నాయి. హతాఫ్-7 క్షిపణి ఇప్పటి వరకు ఉన్న సమతుల్యతలో మార్పులు తెచ్చింది. ముఖ్యంగా భారత్,పాకిస్థాన్, చైనా-పాక్‌ల మధ్య కొనసాగుతున్న వూహాత్మక సంబంధాల నేపధ్యంలో ఈ ప్రాంతంలో సమతుల్యతలో చాలా తేడా వచ్చిందనేని మాత్రం తిరుగులేని వాస్తవం.
చైనా డాంగ్ ఫెంగ్ (ఈస్ట్ విండ్) ఖండాంతర క్షిపణులను తయారు చేసింది. వీటి పరిధి ఎనిమిది వేల కిలోమీటర్లు. ముఖ్యంగా అమెరికా భూభాగంలోని పశ్చిమ తీర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకునే చైనా వీటిని తయారు చేసింది. ఇక ‘షిప్ బస్టర్స్’లను కూడా తూర్పు/దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన అమెరికా కెరియర్ టాస్క్ఫోర్స్ దళాలను దృష్టిలో పెట్టుకొని చైనా రూపొందించింది. టిబెట్‌లో మోహరించిన డాంగ్ ఫెంగ్ క్షిపణులు, భారత ఉపఖండం మొత్తాన్ని తమ పరిధిలోకి తెచ్చుకోగలవు. అంతే కాదు బీజింగ్, షాంఘైలను లక్ష్యంగా చేసుకొని భారత్ ప్రతీకారాత్మక దాడులకు దిగుతుందన్న భయం అంతకు ముందు చైనాకు ఉండేది కాదు. ఆ భరోసాతోనే ఇప్పటివరకు ఉన్నది. అయితే పరిధిని పెంచడానికి వీలయ్యే అగ్ని- 5 క్షిపణి ప్రయోగంతో చైనా ధైర్యం పటాపంచలయింది. అప్పటి వరకు కొనసాగిన అసమతుల్యతను అగ్ని క్షిపణి తొలగించింది. ఇక డాంగ్ ఫెంగ్ ఆయుధ వ్యవస్థ పూర్తి స్థాయి పరిణితి చెంది ఉండగా, అగ్ని-5 క్షిపణి మాత్రం ఇంకా ప్రాథమిక స్థితిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే. అగ్ని క్షిపణిని తిరిగి సైనిక దళాలకు అప్పగించే స్థాయి రావాలంటే, మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉంది. ఆవిధంగా అవసరమైన పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి వీలవుతుంది. అయితే అంతర్జాతీయ సమాజమని చెప్పుకునే, చైనా, దానికి తైనాతీలుగా ఉన్న పాక్ వంటివి, భారత్ ఆవిధంగా మరిన్ని పరీక్షలు జరపకుండా ఉండేందుకు తీవ్రస్థాయిలో వత్తిడి తీసుకొస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వీటితోనే కాకుండా, తాను మిత్రులుగా భావిస్తున్న దేశాలతో కూడా భారత్ దృఢ వైఖరి అవలంబించడం తప్ప మరో మార్గం లేదు. ఇటీవలనే సీనియర్ నాయకుడొకరు, పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేస్తూ, ‘అగ్ని క్షిపణి’ శాంతి ఆయుధమని పేర్కొనడంలో ఎంతో అర్థం ఉంది. అగ్ని-5 యుద్ధానికి కావలసిన అతిముఖ్యమైన ఆయుధమని చెప్పక తప్పదు. శాంతి పరంగా మాట్లాడాలంటే, నిజంగానే అగ్ని అత్యంత శక్తివంతమైనన ‘శాంతి పరిరక్షకురాలు’ అని అర్థం చేసుకోవచ్చు
Source : AndhraBhoomi

జగన్ ఆలయ ప్రవేశంపై ధర్మాచార్యులు ఏమంటారు?

  • - ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040-27425668
తిరుమల వెంకటేశ్వరస్వామిని శ్రీ వై.ఎస్.జగన్మోహనరెడ్డి దర్శించుకొన్న (2 ఏప్రిల్- 2012) తర్వాత తన ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు. ఈ సంఘటన చాలా వివాదాలకు దారితీసింది. సీనియర్ కాంగ్రెసు నాయకుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ ‘హిందూ ధర్మానికి ద్రోహం జరిగింది. స్వామికి అపచారం చేసిన వ్యక్తిని వడ్డికాసులవాడు క్షమించడు’ అని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇంతకూ జగన్ చేసిన ద్రోహం ఏమిటి? అంటే వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించటం. ఇంతకుముందు శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వై.ఎస్.ఆర్. కాని, జగన్ కాని తిరుపతి వస్తే రెడ్ కార్పెట్ వెల్‌కం ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. జగన్ కొత్త పార్టీ పెట్టుకున్నాడు. ఆయనను రాజకీయంగా ఓడించే నిమిత్తం వి.హెచ్.- పైవిధంగా వ్యాఖ్యానించి ఉండవచ్చు.
ఐతే ఈ వ్యాఖ్యలలో నిజాయితీ తక్కువగా ఉన్నట్లు కన్పడుతుంది. శ్రీమతి సోనియాగాంధీ ఎన్నోసార్లు తిరుమలేశుణ్ణి దర్శించుకున్నారు. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పినట్లు కన్పడదు. అన్యమతస్థులు ఆలయ ప్రవేశకర్త డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనే నిబంధన ఒకటి ఉంది. దాని ప్రకారం 2009లో జగన్మోహన్‌రెడ్డి సంతకం పెట్టటం మనకు తెలుసు. పోతే అప్పుడాయన ముఖ్యమంత్రి కుమారుని హోదాలో ఉన్నాడు కాబట్టి ఎవరూ ఎట్టి ఆక్షేపణలూ చేయలేదు. ఇవ్వాళ ముఖ్యమంత్రికీ- ఆయనకూ పడదు కాబట్టి ‘డిక్లరేషను మీద సంతకం పెట్టావా?’ అని అడగటం- ‘లోగడ పెట్టాను’ ఈ జవాబు చెప్పటం అది చాలదు- మళ్లీ మళ్లీ దర్శనానికి వచ్చినప్పుడల్లా సంతకం పెట్టాల్సిందే’నని అడగటం ఇవన్నీ మనం పత్రికలలో చూస్తున్నాము.
మక్కాకు వెళ్లి అక్కడ కాబాను దర్శించుకోవాలంటే కేవలం ముస్లిములకు మాత్రమే ప్రవేశం ఉంది. అలాగే పూరీ- శ్రీరంగం, మధుర, కాశి వంటి దేవాలయాల్లోకి హైందవేతరులను అనుమతించరు. విదేశీ భక్తులు వస్తే ఏంచేయాలి? వారు ప్రత్యేక అనుమతి తీసుకోవలసి ఉంటుంది. 1947కు ముందు హరిజనులకు దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. తర్వాత అలాంటి నిబంధనలు సడలింపబడ్డాయి. ఇప్పటికీ తిరుమలలో, షిర్డీసాయిబాబా, శబరిమలై అయ్యప్ప వంటి దేవతల నామస్మరణకు అనుమతి లేదు. ఈ విషయాలన్నీ పరిశీలించిన మీదట దీనిపై వివిధ పీఠాధిపతులు ధర్మాధికారులు ఒకచోట సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకొని నూతన ధార్మిక వ్యవస్థను రూపొందించవలసిన అవసరం ఉన్నట్లు కన్పడుతున్నది. ఇది తిరుమల, శ్రీరంగం, మధురైకి మాత్రమే పరిమితం కాదు జరుసలేం మక్కా వంటి పుణ్యక్షేత్రాల గూర్చి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులు ఒక ఆలోచన చేయవలసి ఉంది.
నేను తిరుపతి వెళ్లాను. ఎందుకు? వెంకటేశ్వరుణ్ణి దైవంగా అంగీకరించి దర్శించుకునే నిమిత్తం. ఆయన ఆశీస్సులు స్వీకరించే నిమిత్తం. అలాగే జరుసలేం వెళ్లాను. అక్కడ క్రీస్తు శాంతి బోధలపై గౌరవంతోనే వెళ్లాను కాని మానవ బాంబుగా మారి ఆలయ ధ్వంసం చేయాలనే దృష్టితో కాదు కదా? అంటే ఒక వ్యక్తి ఒక ఆలయంలోకి, చర్చిలోకి, మసీదులోకి వచ్చినప్పుడు అక్కడి దైవాన్ని గౌరవించే ప్రయత్నంలోనే వస్తాడు కాని ద్వేషించే దృష్టితో కాదు. ద్వేషించే వాడయితే జన విజ్ఞాన సమితిలోనో లేక కమ్యూనిస్టు పార్టీలోనో చేరి ఉండేవాడు. జగన్‌కు నిజంగా వెంకటేశ్వరస్వామి మీద గౌరవం లేదు. కేవలం అభిమానుల ఓట్లకోసమే ఈ నాటకం ఆడుతున్నాడు, అని కాంగ్రెసువారు ఆక్షేపించారు. ఇదే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిగారు క్రైస్తవుడు. జయసుధ క్రైస్తవురాలు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్రైస్తవుడు. కాసు బ్రహ్మానందరెడ్డిగారి భార్య రాఘవమ్మగారు క్రైస్తవ మతం పుచ్చుకున్నదని నర్సరావుపేటవారు చెప్పారు. ఇది నిజమోకాదో ఇంకా నిర్ధారణకు రాలేదు. ఐతే పైన నేను సూచించిన పేర్లన్నీ దాదాపు ముఖ్యమంత్రి స్థాయిగల వ్యక్తులవే. వీరికి ఆలయ ప్రవేశం లభించిందా? లేదా? ఆనాడు వీరెవరూ డిక్లరేషన్ ఇచ్చినట్లు దాఖలాలు లేవు. ఇవ్వాళ ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమయింది! కాబట్టి ఇవి రాజకీయ ప్రమేయమైన అలజడులు అనేది సుస్పష్టం.
డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక వ్యక్తి టూరిస్టుగా కాక పిల్‌గ్రింగా వచ్చి స్వామిని దర్శించుకుంటే అతడు ఏ దేశస్థుడైనాసరే స్వామి దర్శనానికి అనుమతించాలని నా భావన. ‘విదేశీ వ్యసనపరులు’అంటే అది స్వదేశీ భక్తులకు కూడా వర్తిస్తుంది కదా. ఉదాహరణకు గాలి జనార్దన్‌రెడ్డి వంటి అవినీతిపరుడు నలభైఐదు కోట్ల రూపాయల విలువైన వజ్ర కిరీటాన్ని వెంకటేశ్వరునికి సమర్పిస్తే స్వీకరించడానికి ఆలయ అధికారులకు ఎట్టి అభ్యంతరం లేకపోయింది. డేవిడ్ ఫ్రాలే అనే పాశ్చాత్యుడు వేదాభ్యాసం చేశాడు. శ్రీ చక్రంలో జామెట్రీపై ప్రత్యేక పరిశోధన చేసి తన పేరును వామదేవశాస్ర్తీగా మార్చుకొని శిఖ యజ్ఞోపవీతాలు ధరించాడు. ఇతనిని వెంకటేశ్వర దేవాలయంలోకి అనుమతిస్తారా? లేక డిక్లరేషన్ కావాలని అడుగుతారా?
కాబట్టి ఈ చర్చలో నేను లేవనెత్తిన వౌలికాంశం ఏమంటే మొత్తం దైవభావం ఆలయ దర్శనాల విషయంలో మఠాధిపతులు ధర్మాధికారులు పునరాలోచించి యూనిఫాంగా ఒక ధర్మగ్రంథాన్ని తయారుచేయవలసిన అవసరం ఉంది. ఇందులో శృంగేరీ పీఠాధిపతులు బిషప్పులు పోప్‌లు, ముల్లాలు అందరూ పాల్గొనాలి. ఏకం సత్ విప్రాః బహుధ వదంతి’ అనే ఋగ్వేద వాక్యానికి ఇదీ అర్థం!!
తమిళనాడు అనేక దేవాలయాల్లో నేటికీ గర్భగుడిలో మినుకు మినుకు మనే ఆముదపు దీపాలు వెల్గుతుంటాయి. దైవ విగ్రహం కన్పడనే కన్పడదు. విద్యుద్దీపాలంకరణ లేదు. ఆగమశాస్త్రాలు రచించిన నాటికి విద్యుత్తు పుట్టలేదు కాని నేటి పరిస్థితి వేరు. ఇలాంటి విషయం గూర్చి పీఠాధిపతులు ధర్మవిరుద్ధం కాని ఆధునిక దృక్పధం కలిగి ఉండటం మంచిది!!
జేసుదాసు అయ్యప్ప మీద పాటలు పాడాడు- అని చర్చి అధికారులకు కేరళలో కోపం వచ్చింది. అలాగే పార్శీ మతస్థుల్ని వివాహం చేసుకున్న కారణంగా ఇందిరాగాంధీని పూరీ జగన్నాథ దేవాలయంలోనికి రానివ్వలేదు. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధర్మాధికారులు ఒక నూతన శాసనం వెలువరించే సమయం వచ్చింది.

Source: AndhraBhoomi